RSS

మా నెట్ సెంటర్ కధలు

అవి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అయిపోయి ..మూడో సంవత్సరం లోకి వెళ్తున్న సమయం..అప్పుడు మా బ్యాచ్ కి ఓ అద్బుతమైన ఐడియా వచ్చింది ..ఆ ఐడియా మా అందరిని టాటా ..బిర్లా చేస్తుందని అనుకున్నాము మా కాలేజ్ కి దగ్గరలో ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టాలని..

క్లాస్ లు బంక్ కొట్టిన వాళ్ళు ..ఊసుపోక నెట్ ముందు కూర్చునే వాళ్ళు ...ఇంటర్నెట్ సెంటర్ ని బెడ్ సెంటర్ గా ఫీల్ అయ్యే వాళ్ళు విచ్చల విచ్చల విడిగా వస్తారు ...ఇక మనకి డబ్బులే డబ్బులే అనుకుని ప్రణాళికలు రచించాము..ఇంతకీ ప్లాన్ ఒకే ..కానీ కాసులు ఎక్కడనుండి వస్తాయి..దీనిపై రెండు మూడు రోజులు స్లీప్ లెస్ నైట్స్ గడిపి మరి ఓ దిక్కుమాలిన (కెసిఆర్ గారు క్షమించాలి మీ పదం వాడుకున్నందుకు )ఆలోచన చేసాము..అదేమిటంటే మళ్ళి కాలేజ్ కి వచ్చినప్పుడు ఎలాగు ఫీజ్ కట్టాలి కాబట్టి ..దానిలో సగం కట్టి మిగతా సగం ఇంటర్నెట్ సెంటర్ లో పెట్టుబడి పెట్టాలని డిసైడ్ చేసుకున్నాము..సెలవులకు ఇంటికి బయలు దేరేముందు చేసిన బాసలు మారిపోయాయి ..

మళ్ళి తిరిగి కాలేజ్ కి వచ్చే సరికి కొందరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు..తప్పుకున్న వారిలో నేను ఒకడిని..నాకు ఎందుకో ఈ ప్లాన్ వర్కౌట్ కాదు అనిపించి బస్సు దిగి నేరుగా బ్యాంక్ కి వెళ్లి ఫీజ్ కట్టి మరి ప్రాజెక్ట్ సైట్ కి వెళ్లాను ..ఇంతకీ మేం నెట్ సెంటర్ పెట్టాలి అనుకున్నది ఎక్కడో చెప్పలేదు కదా ..సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే కెసీపి కాలనీ అని ఉండేది ఆ కాలనీ స్టార్టింగ్ లో ..ఓ పక్క కిరాన షాపు..మధ్యలో మా నెట్ కేఫ్ ..అ పక్కన చిన్న హోటల్
ఎవడన్నా హోటల్ పక్కన నెట్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తారా ..కానీ మేం పెట్టేసాం..మొత్తానికి నలుగురు అనుకుంటా(పేర్లు రాయలనే ఉంది కానీ కానే ఎందుకో రాయలేక పోతున్నాను ) ..వారి పెట్టుబడితో షాపు రిమోడలింగ్ కి సిద్దం అయ్యింది..కాలేజ్ లంచ్ బ్రేక్ లో రావటం..పనులు పర్యవేక్షిచటం ..మళ్ళి లాబ్ కి వెళ్ళటం అలా అలా ఒక రెండు నెలలకి పనులు పూర్తి అయి నెట్ సెంటర్ ఓపెనింగ్ కి సిద్దం అయ్యింది..ఈ లోపు నెట్ సెంటర్ చూడటానికి వచ్చిన మిత్రుల కోసం చేసిన సేవలకి ఆ పక్కన హోటల్ లో బిల్లు కూడా తడిచి మోపెడు అయ్యింది ..రోజు హై పిచ్ సౌండ్ తో సింహాద్రి సినిమా పాటలు(ఆ సమయం లో నే ఆ పాటలు రిలీజ్ అయ్యాయి ) వినటం.. సరే నెట్ సెంటర్ ఓపెన్ చేసి రోజులు గడుస్తున్న కంప్యుటర్ ముందు మేం పది మంది తప్పితే ఒక్కడన్నా కొత్త వాడు వస్తే ఒట్టు ..వచ్చిన ప్రతి వాడు మామ ఒక పది నిమిషాలు నెట్ ఇవ్వరా మెయిల్స్ చూసుకుంటా ..ఇప్పడు ఆలోచిస్తే అర్ధం అవుతుంది ..అసలు మనకి ఆ టైం లో మెయిల్స్ పంపే వాడు ఎవడున్నాడు అని... ఏంట్రా ఇలా అయ్యింది అని ఆలోచించి ..చించి మనం నెట్ సెంటర్ ముందు కూర్చుంటే అమ్మాయిలు రావటానికి ఇబ్బంది గా ఉన్నట్లు ఉంది అని మేం సిట్టింగ్ ప్లేస్ మారిస్తే.. కొంచెం బెటర్ ..జనాలు రావటం మొదలు పెట్టారు ..అది ఎంత అంటారా మొదటి నెల సంపాదన ఖర్చులు పోను పదినేను వందల రూపాయిలు ..రెండో నెల ఎనిమిది వందలు ..ఇక మూడో నెల ఒక అమ్మాయి ని పెట్టినా వర్కౌట్ కాలేదు ..ఇక పెట్టుబడిదారులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తి ఏకగ్రీవ తీర్మానం చేసి మరి నెట్ సెంటర్ ని అమ్ముకుని ఏదో తిప్పలు పడి ఫీజ్ కట్టి నాలుగో సంవత్సరానికి వెళ్ళాము .అప్పుడు తెలిసింది ..అతిగా ఆశ పడే వాడు సుఖ పడినట్లు చరిత్రలొ లేదని...

పిఎస్: ఈ నెట్ సెంటర్ పుణ్యమా ..ఫైనల్ ఇయర్ కి మా బ్యాచ్ విడిపోయింది ..ఎవరికీ నచ్చిన వారితో వారు వెళ్లి పోయారు ..ఇద్దరితో నేను ఉండి పోయాను ..వారిలో ఇద్దరు నెట్ సెంటర్ లో పెట్టుబడిదారులు ..వారిలో ఒకరు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మరొకడు టి.సి.ఎస్ లో వర్క్ చేస్తున్నాడు .

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

నయా దోస్తానా





కాంగ్రెస్.. ప్రజా రాజ్యం పార్టీ నయా దోస్తానా కి రంగం సిద్దం అయ్యింది..రోజుకో సమస్యతో నీరసించిన కాంగ్రెస్ పార్టీకి చిరు ఆపాద్భాందవుడిలా కనిపించాడు..తమతో కలిసి పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి అంటోని ద్వారా సమాచారం అందించింది..ఇప్పటికే జగన్ వర్గం తమ మీద చర్యలు తీసుకోమని బహిరంగ సవాల్ విసురుతున్న నేపధ్యంలో తమ తదుపరి వ్యుహ్యం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానం జగన్ వర్గానికి చెప్పకనే చెప్పింది..కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన జగన్ పార్టీ పై ..అధినేత్రిపై రోజుకో విమర్శ చేస్తూ..పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఇరవై కి పైగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది..తాము సోనియా బొమ్మ మీద గెలవలేదని నేరుగా సోనియా పై ఆరోపణలు గుప్పించిన పార్టీ మౌనంగా ..సమయం కోసం వేచి చూసింది..ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో నైతిక విలువలుంటే కాంగ్రెస్ కి రాజీనామా చేసి గెలవాలని చెప్పించింది....అయినప్పటికీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయకపోవటం తో కాంగ్రేస్ పార్టీ యే వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ..దీనిలో బాగం గానే జగన్ కి బహిరంగ మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కొంతమంది పై అనర్హత వేటు వేయాలని బావిస్తుంది...ఒకవేళ జగన్ వర్గానికి చెందిన కొందరి మీద చర్య తీసుకుంటే మిగిలిన వారు మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉన్నందున ప్రజారాజ్యం మద్దతు అవసరంమని కాంగ్రెస్ అధిష్టానం బావించింది ..అందులో బాగం గానే ముందుగా కోర్ కమిటీ సభ్యుడు అంటోని వచ్చి మరి చిరు తో మంతనాలు జరిపాడు.ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ ౩ లేదా నాలుగు బెర్తులు ఇస్తామని .భవిష్యత్తులో రాజ్యసభ సీట్ ఇస్తామని కూడా చిరంజీవికి అంటోని హామీ ఇచ్చాడు..బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రజరాజ్యాన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆ తరువాత జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన అని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి... ప్రస్తుతానికి పీఅర్పీని మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా అంటోని చిరంజీవి ముందు ఉంచాడు ..ఈ విషయాలపై నేరుగా డిల్లీ వచ్చి సోనియా తో మాట్లాడ వచ్చని అంటోని చిరుకి చెప్పారు..
మొత్తం మీద జగన్ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడకూడదని దానికోసం బలమైన ఓటు బ్యాంకు ఉన్న చిరంజీవిని తమతో కలుపుకు పోవాలని దాని ద్వారా పార్టీ మరింత పటిష్టమవుతుందని కాంగ్రెస్ నేతలు బావిస్తున్నారు ..అందుకే చిరంజీవికి మంత్రిపదవి ఆశ చూపి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు .మరో వైపు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దేశ అంతర్గత భద్రత పై జరిగే సమావేశం లో పాల్గొనటానికి డిల్లి వెళ్ళినప్పటికీ కీలకమైన నేతలతో మంతనాలు జరిపారు ..సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ ని కలిసి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు చర్చించారు...వీరిద్దరి మధ్య కడప ,పులివెందుల ఉపఎన్నికల్లో ప్రజారాజ్యం మద్దతు తీసుకునే అంశం చర్చకు వచ్చింది ..రాబోయే రోజుల్లో ఒకే "చిరు బాణం "తో జగన్ ,టిడిపిని దెబ్బ కొట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహం గా కనబడుతుంది..దాని కోసం కాంగ్రెస్ పార్టీ చాచిన స్నేహహస్తం అందుకోవటానికి చిరంజీవి సిద్ధం అయిపోయారు ..సో ఇక మంత్రి వర్గం లోకి చిరు టీం ఇన్ కి ...కాంగ్రెస్ నుండి జగన్ వర్గ ఎమ్మెల్యేలు అవుట్ కి ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. .
-

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS