RSS

నయా దోస్తానా





కాంగ్రెస్.. ప్రజా రాజ్యం పార్టీ నయా దోస్తానా కి రంగం సిద్దం అయ్యింది..రోజుకో సమస్యతో నీరసించిన కాంగ్రెస్ పార్టీకి చిరు ఆపాద్భాందవుడిలా కనిపించాడు..తమతో కలిసి పని చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి అంటోని ద్వారా సమాచారం అందించింది..ఇప్పటికే జగన్ వర్గం తమ మీద చర్యలు తీసుకోమని బహిరంగ సవాల్ విసురుతున్న నేపధ్యంలో తమ తదుపరి వ్యుహ్యం ఏమిటో కాంగ్రెస్ అధిష్టానం జగన్ వర్గానికి చెప్పకనే చెప్పింది..కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన జగన్ పార్టీ పై ..అధినేత్రిపై రోజుకో విమర్శ చేస్తూ..పార్టీ టిక్కెట్ మీద గెలిచిన ఇరవై కి పైగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది..తాము సోనియా బొమ్మ మీద గెలవలేదని నేరుగా సోనియా పై ఆరోపణలు గుప్పించిన పార్టీ మౌనంగా ..సమయం కోసం వేచి చూసింది..ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తో నైతిక విలువలుంటే కాంగ్రెస్ కి రాజీనామా చేసి గెలవాలని చెప్పించింది....అయినప్పటికీ జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎవరు రాజీనామా చేయకపోవటం తో కాంగ్రేస్ పార్టీ యే వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది ..దీనిలో బాగం గానే జగన్ కి బహిరంగ మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కొంతమంది పై అనర్హత వేటు వేయాలని బావిస్తుంది...ఒకవేళ జగన్ వర్గానికి చెందిన కొందరి మీద చర్య తీసుకుంటే మిగిలిన వారు మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉన్నందున ప్రజారాజ్యం మద్దతు అవసరంమని కాంగ్రెస్ అధిష్టానం బావించింది ..అందులో బాగం గానే ముందుగా కోర్ కమిటీ సభ్యుడు అంటోని వచ్చి మరి చిరు తో మంతనాలు జరిపాడు.ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ ౩ లేదా నాలుగు బెర్తులు ఇస్తామని .భవిష్యత్తులో రాజ్యసభ సీట్ ఇస్తామని కూడా చిరంజీవికి అంటోని హామీ ఇచ్చాడు..బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రజరాజ్యాన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఆ తరువాత జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన అని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి... ప్రస్తుతానికి పీఅర్పీని మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ 2014 ఎన్నికల్లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనను కూడా అంటోని చిరంజీవి ముందు ఉంచాడు ..ఈ విషయాలపై నేరుగా డిల్లీ వచ్చి సోనియా తో మాట్లాడ వచ్చని అంటోని చిరుకి చెప్పారు..
మొత్తం మీద జగన్ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడకూడదని దానికోసం బలమైన ఓటు బ్యాంకు ఉన్న చిరంజీవిని తమతో కలుపుకు పోవాలని దాని ద్వారా పార్టీ మరింత పటిష్టమవుతుందని కాంగ్రెస్ నేతలు బావిస్తున్నారు ..అందుకే చిరంజీవికి మంత్రిపదవి ఆశ చూపి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసారు .మరో వైపు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దేశ అంతర్గత భద్రత పై జరిగే సమావేశం లో పాల్గొనటానికి డిల్లి వెళ్ళినప్పటికీ కీలకమైన నేతలతో మంతనాలు జరిపారు ..సోనియా రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్ ని కలిసి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు చర్చించారు...వీరిద్దరి మధ్య కడప ,పులివెందుల ఉపఎన్నికల్లో ప్రజారాజ్యం మద్దతు తీసుకునే అంశం చర్చకు వచ్చింది ..రాబోయే రోజుల్లో ఒకే "చిరు బాణం "తో జగన్ ,టిడిపిని దెబ్బ కొట్టాలన్నదే కాంగ్రెస్ వ్యూహం గా కనబడుతుంది..దాని కోసం కాంగ్రెస్ పార్టీ చాచిన స్నేహహస్తం అందుకోవటానికి చిరంజీవి సిద్ధం అయిపోయారు ..సో ఇక మంత్రి వర్గం లోకి చిరు టీం ఇన్ కి ...కాంగ్రెస్ నుండి జగన్ వర్గ ఎమ్మెల్యేలు అవుట్ కి ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. .
-

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment